Saturday, May 5, 2012

పిట్టకథలు

మన పురాణ ఇతిహాసాలపై, కట్టుకథలు పిట్టకథలు చాలా ఉన్నాయి.

ఉదా : సినిమాల్లో " ఇంద్రుడు " అనగానే క్లబ్బు డాన్సులు, ఆయన్ని గందరగోళంగా చూపిస్తారు.
ఇంద్రుడు దేవతలకు రాజు కాబట్టి ఎవరైనా " తపస్సు " ఆచరిస్తే " కామానికి, క్రోధానికి " లొంగిపోతాడా ?
లేక భగవంతుని చేరుకుంటాడా ? అని పరీక్ష చేసే అధికారం ఆయనకి ఉంది. అందుకే రంభాది పరీక్షలు.

కల్పాన కథలు :
కవులు కూడా చాల కథలు సృష్టించారు. 

౧]  శ్రీ కృష్ణార్జున యుద్ధం

వారిద్దరు నర నారాయణులు అన్యోన్న్య ప్రీతి కలవారు.
పురాణాల్లో వీరికి యుద్ధం జరిగినట్టుగా ఎక్కడా లేదు 
ఉదా : ఖాండవ వన దహన సమయంలో మయుడు అనే రాక్షసుని సంహరించడానికి,
శ్రీకృష్ణుడు చక్రాన్ని ప్రయోగిస్తాడు. అది చూసి మయుడు " అర్జునా రక్ష రక్ష " అంటాడు.
అర్జునుడు అభయం ఇవ్వగానే కృష్ణుడు తన సుదర్శనాన్ని ఉపసంహరించుకుంటాడు.
అసలు శ్రీ కృష్ణుడు " అర్ఘ్యం " వదలనూలేదు గంధర్వుని " నిష్టీవనం " పడనూ లేదు. 
అర్జునుడు అభయం ఇస్తే కృష్ణుడు సంహరిస్తానని అనడు యుద్ధానికి రాడు. కేవలం,
కవుల కల్పితాలే ఇవన్నీ..

౨ ] శ్రీ కృష్ణ తులాభారం 

మన సంస్కృతిలో పతినే  ప్రత్యక్ష దైవంగా పూజిస్తాము 
అలాంటిది పతిని దానం చేసే వ్రతం ఉంటుందా ?
మూలంలో లేని కథలన్నీ కల్పించి రాస్తే దాన్ని సినిమా వాళ్ళు,
మరి కొంచం మెరుగులు దిద్ది ప్రజల్లోకి వదిలారు.
సినిమా వాళ్ళు కూడా మన పురాణేతిహాస కథలను భ్రష్టు పట్టించారు.

౩] మాయా బజార్ 

అసలు బలరాముడికి " శశిరేఖ " అన్న కూతురే లేదు దానికి పెళ్లి తతంగం స్టంటు
అందుకే " మాయాబజార్ " అన్న పేరు పెట్టారేమో ?

౪] రామాంజనేయ యుద్ధం 

ఇలాంటివి ఎన్నో సినిమాలు ఉండటం వల్ల ప్రజలు అవి వాస్తవం అని నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు..
పాపం వాళ్లకి మాత్రం ఏమి తెలుసు..!
అందుకే " పురాణ గ్రంధాలు " చదవనిదే ఇది వాస్తవం అని నిర్ధారించు కోవద్దు..

|| విశిష్ట ధ్యాన శ్లోకములు ||

గణాధిపతిని వర్ణించు పద్యము

అంకముజేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ బా ల్యాంకవిచేష్ట తొండమున అవ్వలిచన్‌ కబళింపబోయి ఆ వంక కుచంబు గాన కహివల్లభహారము గాంచి వే మృణా ళాంకురశంక నంటెడు గజాస్యుని కొల్తు నభీష్టసిద్ధికిన్.


సరస్వతీ దేవి శ్లోకములు




శ్లో||  పంచాశల్లిపిభిర్విభక్త ముఖదో: పన్మధ్య వక్షస్థలాం
      భాస్వన్మౌలి నిబద్ధ చంద్ర శకలామాపీన తుంగస్తనీం
      ముద్రామక్షగుణం సుధాఢ్యకలశం విద్యాం చ హస్తామ్బుజై:
      బిభ్రాణాం విశదప్రభాం త్రినయనాం వాగ్దేవతామాశ్రయే ||



      శారదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
      హార తుషార ఫేన  రజతాచల కాశ ఫణీశ కుంద మం
      దార సుధాపయోధి సిత తామర  సామరవాహినీ శుభా 
      కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడుగల్గు భారతీ!  


త్రిమూర్తులను వర్ణించు శ్లోకము

రచన: నన్నయ్య 
 
శ్రీ వాణీ గిరిజా శ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు యే
లోకానాం స్థితి మావహన్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం
తేవేదత్రయమూర్తయ స్త్రీపురుషా స్సంపూజితా వస్సురై
ర్భూయాసుః పురుషోత్తమాంబుజ భవ  శ్రీకంధరా శ్శ్రేయసే ||
 
 

నవగ్రహ ధ్యాన శ్లోకములు


శ్లో|| ఆరోగ్యం పద్మబన్ధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మి:
     భూలాభం భూమిపుత్రస్సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్య: |
     సౌభాగ్యం దేవమన్త్రీ రిపుభయశమనం భార్గవశ్శౌర్యమార్కి:
     దీర్ఘాయుస్సైంహికేయో విపులతరయశ: కేతురాచంద్రతారం ||

శ్లో|| అరిష్టాని ప్రణశ్యన్తు దురితాని భయాని చ |
      శాన్తిరస్తు శుభం మేస్తు గ్రహా: కుర్వన్తు మంగళం ||
స్త్రీరూపాం చింతయే ద్దేవీం పుంరూపం వా విచిన్తయేత్ |
అథవా  నిష్కలం ధ్యాయే   త్సచ్చిదానంద   లక్షణమ్ ||
                                                          తంత్రసార: 

स्त्री  रूपाम्  चिन्तये  द्देवीं  पुंरूपं वा   विचिन्तयेत
अथवा   निष्कलं   ध्याये  त्सच्छिदानन्द   लक्षणं ॥
                                                      तन्त्रसार :

జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య చిత్ర పటములు